దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 18,738 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,41,45,732 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 40 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,689 కి పెరిగింది. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం లక్ష 34 వేలుకుపైగా (1,34,933 (0.31%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కొత్తగా 18,558 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,34,84,110 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.50 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
ముఖ్యంగా గత 24 గంటల్లో ఢిల్లీ (2311), మహారాష్ట్ర (1931), కర్ణాటక (1694), కేరళ (1113), తమిళనాడు (1094), గుజరాత్ (965), హర్యానా (907), ఉత్తరప్రదేశ్ (905), ఒడిశా (836), జమ్మూకాశ్మీర్ (796) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఆగస్టు 7, ఆదివారం ఉదయం 7 గంటల వరకు 206.21 కోట్లకుపైగా (2,06,21,79,401) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 29,09,695 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY