భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 20,000 దాటింది. ఆగస్టు 16, ఆదివారం నాటికీ మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 20,037 కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,865 కి చేరింది. కరోనా బాధితుల్లో 4,17,123 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,58,395 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటివరకు 12,290 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. 9,850 మంది పోలీసులు కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, 2,315 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన 125 మంది పోలీసులు మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu