భారత్ లో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 22, మంగళవారం ఉదయానికి మొత్తం కేసులు సంఖ్య 1,00,75,116 చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 301 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,46,111 కి పెరిగింది. మరోవైపు ఇప్పటికే 96 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకేరోజులో 30,376 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 96,36,487 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.65 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 2,92,518 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ