దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో మరోసారి 20వేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,557 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,39,59,321 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 45 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,212 కి పెరిగింది. దీంతో దేశంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య లక్ష 46 వేలు (1,46,322 (0.33%)) దాటింది. అలాగే కొత్తగా 19,216 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,32,86,787 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.47 శాతంగానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
ముఖ్యంగా గత 24 గంటల్లో మహారాష్ట్ర (2138), కేరళ (2130), తమిళనాడు (1803), కర్ణాటక (1624), పశ్చిమబెంగాల్ (1273), ఒడిశా (1174), గుజరాత్ (979), హిమాచల్ ప్రదేశ్ (916), తెలంగాణ (852), అస్సాం (797) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద జూలై 28, గురువారం ఉదయం 7 గంటల వరకు 203.21 కోట్లకుపైగా (2,03,21,82,347) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 40,69,241 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY