మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల రోజువారీ కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 58 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఏప్రిల్ 5, సోమవారం కూడా 47,288 కరోనా కేసులు, 155 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,57,885 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 56,033 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 26,252 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 25,49,075 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 83.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.83 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 4,51,375 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 2,07,15,793 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ