ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాపరంగా వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.317 కోట్ల గ్రాంట్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ఈ నిధులతో ఆయా జిల్లాలలో మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో పాటు కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచనున్నారు. కాగా బుధవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి సుభాష్ సర్కార్ ఈ విధంగా బదులిచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 374 జిల్లాలు విద్యాపరంగా వెనకబడినట్లు యూజీసీ నిపుణుల సంఘం గుర్తించిందని తెలిపిన ఆయన ఏపీలో ఏపీలోని అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విద్యలో వెనకబడిన జిల్లాలుగా గుర్తించినట్లు చెప్పారు.
ఈ జిల్లాల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి, జాతీయ సగటు 12.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు యూజీసీ నిపుణుల సంఘం దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని, దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా)ను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ ‘రూసా’ పథకం కింద విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో పాటు కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులను గ్రాంట్గా మంజూరు చేస్తుందని, ఈ క్రమంలోనే ఏపీలోని వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.317 కోట్లు విడుదల చేయాలని ‘రూసా’ బోర్డు నిర్ణయించిందని మంత్రి సుభాష్ సర్కార్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ