దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,060 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 10 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,905 కు పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 455, మహారాష్ట్రలో 440, తమిళనాడులో 279, పశ్చిమబెంగాల్ లో 145, ఢిల్లీలో 115, కర్ణాటకలో 108 నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో తెలంగాణలో 69, ఆంధ్రప్రదేశ్ లో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 17, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 89,86,99,680
- అక్టోబర్ 16న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,10,863
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 16–అక్టోబర్ 17 (8AM-8AM)] : 2,060
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,30,888
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 1,841
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,40,75,149
- కరోనా రికవరీ రేటు : 98.75 శాతం
- యాక్టీవ్ కేసులు : 26,834 (0.06 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 10
- మొత్తం మరణాల సంఖ్య : 5,28,905
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY