ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 మినీ వేలం ప్రక్రియ ఏర్పాట్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 16న బెంగుళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వేలం తేదీని ఖరారు చేస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అలాగే ఐపీఎల్ లోని పది ఫ్రాంచైజీలను కూడా రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాలని కోరినట్టు సమాచారం. కాగా మినీ వేలానికి ఒక వారం ముందు వరకు కూడా ప్రాంచైజీల మధ్య ట్రేడ్/బదిలీ విండో తెరిచి ఉండనుంది.
మరోవైపు ఐపీఎల్-2023 కోసం రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఈసారి ఎటువంటి పరిమితి ఉండనట్టు తెలుస్తుంది. అదేవిధంగా వేలంపాటకు సంబంధించి ఒక్కో ఫ్రాంచైజీకి గతంలో ఆటగాళ్ల కొనుగోలు కోసం/సాలరీ పర్స్ గరిష్టంగా రూ.90 కోట్లు ఉండగా, డిసెంబర్లో జరిగే ఐపీఎల్-2023 మినీ వేలం కోసం ఒక్కో జట్టుకు సాలరీ పర్స్ రూ.5 కోట్లు పెంచి, రూ.90 కోట్లకు అనుమతినిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY