తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 26వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు టీఎస్ ఎంసెట్ కన్వీనర్ తాజాగా ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీని (ఆలస్య రుసుము లేకుండా) మే 18 గా ప్రకటించగా, రేపటితో ఆ గడువు ముగియనుండంతో మే 26వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రవేశ పరీక్ష సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో జరగనుండగా, జులై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, జులై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ