దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. 6 నెలల తర్వాత, తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు 3000కు పైగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 3016 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 4,47,12,692 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 14 మరణాలు (ఢిల్లీలో 2, మహారాష్ట్రలో 3, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 8) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,862కి పెరిగింది. కాగా మార్చి 29న 1,10,522 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతంగా నమోదైంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 686, మహారాష్ట్రలో 483, గుజరాత్ లో 401, ఢిల్లీలో 300, హిమాచల్ ప్రదేశ్ లో 255 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, మార్చి 30, ఉదయం 8 గంటల వరకు):
- మార్చి 29న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,10,522
- కొత్తగా నమోదైన కేసులు [మార్చి 29–మార్చి 30(8AM-8AM)] : 3016
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,12,692
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 1396
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,68,321
- కరోనా రికవరీ రేటు : 98.78 శాతం
- యాక్టీవ్ కేసులు : 13,509
- కొత్తగా నమోదైన మరణాలు : 14
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,862
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE