శ్రీ రామనవమి పర్వదిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ శ్రీ రామచంద్ర జీవితం ప్రతి యుగంలో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. “శ్రీ రామ నవమి శుభ సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. త్యాగం, తపస్సు, సంయమనం మరియు సంకల్పం ఆధారంగా మర్యాద పురుషోత్తమ భగవాన్ రామచంద్రుని జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేస్తూ, “శ్రీ రామ నవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తం శ్రీరాముడి పాత్ర నుండి త్యాగం మరియు సేవ యొక్క అమూల్యమైన సందేశం అందుకున్నాం. దేశప్రజలందరూ శ్రీరాముని మహోన్నతమైన ఆశయాలను అలవర్చుకుని ఉజ్వల భారతదేశ నిర్మాణానికి తమను తాము అంకితం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE