దేశంలో కరోనా వ్యాప్తి పూర్తి తగ్గుముఖ స్థాయికి చేరింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 74 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,84,274 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,753 గా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 25, కర్ణాటకలో 19, ఒడిశాలో 6, తమిళనాడులో 4, పంజాబ్ లో 3 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఫిబ్రవరి 14, ఉదయం 8 గంటల వరకు)
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 91,72,69,698
- ఫిబ్రవరి 13న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,27,835
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 13–ఫిబ్రవరి 14 (8AM-8AM)] : 74
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,84,274
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 93
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,51,703
- కరోనా రికవరీ రేటు : 98.81 శాతం
- యాక్టీవ్ కేసులు : 1,818
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,753
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE