భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76 లక్షలు దాటింది. అక్టోబర్ 21, బుధవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 76,51,107 కు, మరణాల సంఖ్య 1,15,914 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 54,044 కరోనా పాజిటివ్ కేసులు, 717 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటికే 67 లక్షలకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకే రోజులో 61,775 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 67,95,103 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 88.1 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.51 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,40,090 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో అక్టోబర్ 20 నాటికీ 9,72,00,379 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 10,83,608 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu