తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తుడా పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను తుడాలో విలీనం చేయడంపై బుధవారం నాడు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరదయపాలెం మరియు సత్యవేడు మండలాలలో శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయించి, కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తుడా పరిధిలోకి కలుపుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తాజాగా తుడా మొత్తం పరిధి 4472 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu