దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. కొత్తగా 49881 పాజిటివ్ కేసులు నమోదు కాగా అక్టోబర్ 29, గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 80,40,203 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 517 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,20,527 కి పెరిగింది. మరోవైపు ఇటీవల కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 56,480 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 73,15,989 కు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 90.99 శాతం గానూ, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసొలేషన్స్ లో ప్రస్తుతం 6,03,687 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu