కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి పలు దేశాలు, సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ కూడా గొప్ప మనసు చాటుకున్నారు. భారత్ లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు 50,000 వేల డాలర్లను పీఎం కేర్స్ కు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశాడు. అలాగే తన తోటి ఐపీఎల్ ఆటగాళ్లను కూడా ఈ పోరాటంలో భారత్ కు సహకరించాలని పిలుపునిచ్చారు. పాట్ కమిన్స్ ప్రస్తుతం ఐపీఎల్-14 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. గొప్ప మనసుతో విరాళం ప్రకటించిన పాట్ కమిన్స్ కు దేశంలోని పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.
— Pat Cummins (@patcummins30) April 26, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ