దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే కొత్తగా 44281 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 11, బుధవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 86,36,011 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 512 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,27,571 కి పెరిగింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 80 లక్షలు దాటింది. ఒకేరోజులో 50236 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 80,13,783 కు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 92.79 శాతం గానూ, మరణాల రేటు 1.48 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,94,657 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ