భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలు దాటింది. అయితే గత 10 రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 35551 పాజిటివ్ కేసులు, 526 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 95,34,964 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,38,648 కి పెరిగింది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 4,22,943 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 40,726 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 89,73,373 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.11 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 3, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 14,35,57,647
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 95,34,964
- కొత్తగా నమోదైన కేసులు [డిసెంబర్ 2–డిసెంబర్ 3 (8AM-8AM)] : 35551
- నమోదైన మరణాలు : 526
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 89,73,373
- యాక్టీవ్ కేసులు : 4,22,943
- మొత్తం మరణాల సంఖ్య : 1,38,648
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ