గతకొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వం మరియు గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ రవి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సందర్భంగా డీఎంకే ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగంలో పలు మార్పులు చేశారు. దీంతో ఆయన ప్రసంగంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. తమిళంలో ముద్రించిన అసలు ప్రసంగాన్ని మాత్రమే రికార్డుల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అయితే దీనిపై అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ రవి గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ గీతం ఆలపించకముందే సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రసంగంలో భాగంగా తమిళంలో ఇచ్చిన దానికి ఆంగ్ల అనువాదం చేస్తూ పలుచోట్ల తడబడ్డారు. అలాగే ప్రభుత్వం అందించిన ప్రసంగం ప్రతిలోని 12వ పాయింట్లో కొంత భాగాన్ని దాటవేశారు. ఇది రాష్ట్రం యొక్క శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం కావడం గమనార్హం. అలాగే రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మరియు మహమ్మారిపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దానికి సంబంధించి 64వ పాయింట్ను కూడా ఆయన దాటవేశారు. వీటితో పాటుగా తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ అనూహ్యంగా తమిళంలో ముద్రించిన అసలు ప్రసంగాన్ని మాత్రమే రికార్డుల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ సభలో తీర్మానం పెట్టడం విశేషం. ప్రసంగం కాపీలో ‘ద్రావిడ మోడల్’ మరియు ‘తమిళనాడు’ అని వచ్చిన సందర్భంలో గవర్నర్ కావాలనే వాటిని ఉచ్ఛరించకుండా ప్రత్యామ్నాయ పదాలను వాడారని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అయితే దీనిపై కినుక వహించిన గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార పార్టీ సహా మిత్ర పక్షాల సభ్యులు తమిళ ప్రజలను గవర్నర్ కించపరుస్తున్నారని ఆరోపిస్తూ అసెంబ్లీలో ఆందోళనకు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE