దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 3.06 కోట్లకుపైగా (3,06,34,638) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత కేటగిరీ ద్వారా మరియు నేరుగా రాష్ట్రాల సేకరణ కేటగిరీ ద్వారా మొత్తం 29.10 కోట్లకుపైగా (29,10,54,050) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.
ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి జూన్ 20, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 26,04,19,412 డోసులను వినియోగించినట్టు కేంద్రం ప్రకటించింది. రాబోయే 3 రోజుల్లో మరో 24.53 లక్షలకుపైగా (24,53,080) వ్యాక్సిన్ డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ