కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 14 కోట్లు దాటింది. 14 కోట్ల వ్యాక్సిన్ డోసులను కేవలం 99 రోజుల్లోనే పంపిణీ చేసి, ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఈ లక్ష్యం చేరుకున్న దేశంగా భారత్ నిలిచింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 14 కోట్లు ( 14,09,16,417) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇందులో 92,90,528 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 59,95,634 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 1,19,50,251 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 62,90,491 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు), 4,76,83,792 మంది 45-60 ఏళ్ల వారికీ (మొదటి డోసు), 23,30,238 మంది 45-60 ఏళ్ల వారికీ (సెకండ్ డోసు), 4,96,55,753 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (మొదటి డోసు), 77,19,730 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (సెకండ్ డోసు) కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 99వ రోజైన ఏప్రిల్ 24, శనివారం నాడు ఒక్కరోజే 25 లక్షలకుపైగా (25,36,612) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ