దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా, మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య దాదాపు 17 కోట్లకు (16,94,39,663) చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇందులో 95,41,654 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 64,63,620 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 1,39,43,558 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 77,32,072 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు), 5,50,75,720 మంది 45-60 ఏళ్ల వారికీ (మొదటి డోసు), 64,09,465 మంది 45-60 ఏళ్ల వారికీ (సెకండ్ డోసు), 5,36,34,743 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (మొదటి డోసు), 1,48,53,962 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (సెకండ్ డోసు), 17,84,869 మంది 18-44 ఏళ్ల వారికి (మొదటి డోస్) కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 113వ రోజైన మే 7, శనివారం నాడు ఒక్కరోజే 20 లక్షలకుపైగా (20,23,532) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ