దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో మరో 75,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 1023 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఆగస్టు 27, గురువారం నాటికి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 33,10,234 కు, మరణాల సంఖ్య 60,472 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు కొత్తగా 56,013 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినా వారి మొత్తం సంఖ్య 25,23,771 కు చేరుకుంది. ప్రస్తుతం 7,25,991 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.24 శాతం, మరణాల రేటు 1.83 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 27, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 33,10,234
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 26–ఆగస్టు 27 (8AM-8AM)] : 75,600
- నమోదైన మరణాలు : 1023
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 25,23,771
- యాక్టీవ్ కేసులు : 7,25,991
- మొత్తం మరణాల సంఖ్య : 60,472
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu