కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 24,296 కరోనా కేసులు, 173 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,51,984 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 19,757 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 19,349 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 36,72,357 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక మలప్పురం జిల్లాలో అత్యధికంగా 27552 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 25711, ఎర్నాకులంలో 18420, పాలక్కాడ్ లో 11082, తిరువనంతపురంలో 9677, త్రిస్సుర్ లో 9579 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 3,04,53,773 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ