ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 30, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,70,491 కు చేరుకుంది. గత 24 గంటల్లో 39,296 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 10,310 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా కడప జిల్లాలో 1697, కర్నూల్ జిల్లాలో 1379, గుంటూరు జిల్లాలో 1249, కృష్ణా జిల్లాలో 1008, నెల్లూరు జిల్లాలో 927, తూర్పుగోదావరి జిల్లాలో 910, విశాఖపట్నం జిల్లాలో 853, ప్రకాశం జిల్లాలో 700, పశ్చిమగోదావరిలో 626, చిత్తూరు జిల్లాలో 411, శ్రీకాకుళం జిల్లాలో 229, విజయనగరంలో 222, అనంతపూర్ జిల్లాలో 99 కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 12 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 14606 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 9,692 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 21,39,854 కు చేరింది. అలాగే ప్రస్తుతం 1,16,031 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జనవరి 30 నాటికీ ఏపీలో మొత్తం 3,24,45,428 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ