ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 168 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 19, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,906 కు, మరణాల సంఖ్య 14,425 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 301 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,54,056 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,425 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(168):
- చిత్తూరు – 35
- కృష్ణా – 26
- విశాఖపట్నం – 22
- గుంటూరు – 20
- తూర్పుగోదావరి – 19
- నెల్లూరు – 13
- శ్రీకాకుళం – 9
- అనంతపూర్ – 9
- పశ్చిమగోదావరి – 8
- కడప – 3
- ప్రకాశం – 2
- విజయనగరం – 2
- కర్నూల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ