ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,17,812 కు చేరుకుంది. గత 24 గంటల్లో 7,969 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 71 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 16, అనంతపూర్ జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 5, కడప జిల్లాలో 5, పశ్చిమగోదావరిలో 4, కృష్ణా జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 2, కర్నూల్ జిల్లాలో 0, విజయనగరం జిల్లాలో 0, శ్రీకాకుళం జిల్లాలో 0 కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వలన కొత్తగా కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14727 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 595 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,00,760 కు చేరింది. అలాగే ప్రస్తుతం 2,325 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఫిబ్రవరి 28 నాటికీ ఏపీలో మొత్తం 3,31,05,610 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ