దేశంలో గడచిన కొన్ని నెలలుగా నిత్యావసరాల ధరల పెరుగుదలతో, ఇంధన ధరల పెరుగుదలతో, వరుస చార్జీల బాదుడుతో అల్లాడుతున్న వ్యాపారస్తులకు స్వల్ప ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 135 తగ్గించినట్లు బుధవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ను వినియోగించే చిరు వ్యాపారస్తులకు ఇది ఒకరకంగా శుభవార్తే. గత రెండు నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలను వరుసగా రెండు సార్లు భారీగా పెంచిన ఆయిల్ కంపెనీలు, తాజాగా దీనిపై భారీగా ధర తగ్గించడం విశేషం. అయితే, గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి సవరణను ప్రకటించలేదు కంపెనీలు.
కాగా చివరిసారి మే 19న డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజా ధరల తగ్గింపుతో హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,220.50 గా ఉంది. రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 2,355.50 నుండి రూ. 2219 కి తగ్గింది. అలాగే సవరించిన ధరల ప్రకారం కోల్కతాలో రూ. 2322, ముంబైలో రూ. 2171, చెన్నైలో రూ. 2373 లకు లభించనున్నది. దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను నెలలో రెండుసార్లు ప్రకటిస్తారు. తొలుత నెల ప్రారంభంలో, అనంతరం నెల మధ్యలో ధరల హెచ్చుతగ్గులను వెల్లడిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF