దేశంలో కొత్తగా 112 మందికి కరోనా పాజిటివ్, 220 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

India Records 112 Fresh Covid-19 Positive Cases 3 Deaths in the Last 24 Hours,3 Covid Deaths,Covid Last 24 Hours, 112 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మరో 112 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,76,199 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (62), కర్ణాటక (12), మహారాష్ట్ర (9), తెలంగాణ (6), తమిళనాడు (5) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన మరో 3 మరణాలు (మధ్యప్రదేశ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 2) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,677కి పెరిగింది.. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 3,490 (0.01%) కు తగ్గింది.

మరోవైపు మరో 178 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,42,032 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా డిసెంబర్ 20, మంగళవారం ఉదయం 8 గంటల వరకు 220 కోట్లకుపైగా (2,20,00,92,109) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 47,431 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 10 =