మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఫిబ్రవరి 18, గురువారం నాడు కూడా 5427 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,81,520 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,669 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 2,543 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,87,804 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.5 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.48 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 40,858 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గురువారం నాటికి మహారాష్ట్రలో 1,55,21,198 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ