దేశంలోని పలు రాష్ట్రాలలో గత 24 గంటల్లో కొత్తగా 134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,81,505కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (60), కర్ణాటక (24), మహారాష్ట్ర (14), తమిళనాడు (6), పంజాబ్ (4) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 170 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,48,815 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
మరోవైపు కరోనా వలన ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530728 గా ఉంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 1962కు తగ్గింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా జనవరి 19, గురువారం ఉదయం 8 గంటల వరకు 220.20 కోట్లకుపైగా (2,20,20,39,815 ) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి. ముందు రోజున 1,86,727 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE