దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,86,202కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (56), కేరళ (46), మహారాష్ట్ర (35), తమిళనాడు (16) తెలంగాణ (7) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. ఇక ఇక కరోనా వలన మరో మరణం (కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,770కి పెరిగింది.
ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ రెండు వేలుకుపైగా (2,229) చేరుకుంది. అలాగే మరో 104 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,53,203 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఫిబ్రవరి 27, సోమవారం ఉదయం 8 గంటల వరకు 220.63 కోట్లకుపైగా (220,63,81,913) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE