దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 25 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 300 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,021 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 28, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871 కు చేరుకుంది. కరోనాతో మరో 279 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,47,901 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 97 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 21,131 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 97,82,669 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 95.83 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 2,77,301 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 20,021 కేసులలో 80 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ