ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు డిసెంబర్ 18 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. తాజాగా సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ను డెహ్రాడూన్లోని ఆస్పత్రి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా జ్వరం కారణంగా ఆదివారం నాడు డెహ్రాడూన్లోని గవర్నమెంట్ డూన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించినట్టుగా అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ