కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,946 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,777 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 50,904 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 5,280 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 52,28,710కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,21,458 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 30149 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 20124, కోజికోడ్ లో 12015, త్రిస్సుర్ లో 11995, కొట్టాయంలో 9030, కొల్లంలో 7061, మలప్పురంలో 5817, పాలక్కాడ్ లో 5070 కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి కేరళలో 4,25,41,242 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ