దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 102 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 22,431 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,94,312 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 318 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,49,856 కి పెరిగింది. ప్రస్తుతం 2,44,198 (0.72%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు గత 204 రోజుల్లో కనిష్ఠానికి చేరుకున్నాయి.
గత 24 గంటల్లో కేరళ (12,616), మహారాష్ట్ర (2,876), మిజోరాం (1,471), తమిళనాడు (1,432), ఆంధ్రప్రదేశ్ (800), వెస్ట్ బెంగాల్ (786), ఒడిశా (593), కర్ణాటక (523) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 24,602 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,32,00,258 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.95 శాతంగానూ, మరణాల రేటు 1.33 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ