దేశంలో కొత్తగా 249 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,74,439 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (93), మహారాష్ట్ర (41), కర్ణాటక (23), తెలంగాణ (9), తమిళనాడు (9) వంటి 5 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, అయితే కేరళలో సవరణ కింద 6 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,653 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 4,228 (0.01%) కు చేరుకుంది.
మరోవైపు మరో 259 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,39,558 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా డిసెంబర్ 9, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 219.96 కోట్లకుపైగా (2,19,96,18,587) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 49,941 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE