హైదరాబాద్ మహానగరంలో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు ఈ రోజు (డిసెంబర్ 9, శుక్రవారం) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ముందుగా నగరంలోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంకుస్థాపన ప్రదేశంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, సీఎం కేసీఆర్ శిలాఫలకం పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పలువురు నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మెట్రో రైల్ రెండో దశ విస్తరణలో భాగంగా మైండ్ స్పేస్-ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హెఛ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో నిర్మించనున్నారు. మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టును రూ.6,250 కోట్లతో నిర్మించనుండగా, రానున్న మూడు సంవత్సరాలల్లో ఈ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ మెట్రో కారిడార్ నిర్మాణం బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ, నానక్ రాంగూడ, నార్సింగి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో మీదుగా జరగనుంది. కాగా ఈ కారిడార్ లో ఎలివేటెడ్ వే 27.5 కిమీ, భూగర్భ మార్గం 2.5 కిమీ ఉంది. మెట్రో రైలు లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం సీఎం కేసీఆర్ రాజేంద్ర నగర్ పోలీస్ గ్రౌండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE