రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు బుధవారం నాడు వెల్లడించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 వేలమంది ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు అందరికి మే 28 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లా స్థాయిలో సమాచారశాఖ ద్వారా, జీహెఛ్ఎంసీ పరిధిలో సమాచార శాఖ మరియు జీహెఛ్ఎంసీ విభాగం ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ