హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో “భారత్ రాష్ట్ర సమితి” పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించి ఈసీ నుంచి అందిన అధికారిక లేఖకు రిప్లైగా సీఎం కేసీఆర్ సంతకం చేశారు. పత్రాలపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. సీఎం సంతకం చేసిన లేఖను పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, నటుడు ప్రకాశ్ రాజ్, తదితరులు అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కండువాను సీఎం కేసీఆర్ ధరించారు.
శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుని ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన అనంతరం పార్టీ కార్యాలయంలో ‘భారత్ రాష్ట్ర సమితి’ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ సందర్భంగా పార్టీ నేతలు జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో మార్మోగించారు. ఆ తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున సందడి నెలకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొనగా, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీ కేశవరావు, ఎంపీ కవిత, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ సహా పలువురు రాష్ట్రమంత్రులు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు, జాతీయ రైతు సంఘ నేతలు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE