భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. కాగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా 29,398 కరోనా కేసులు, 414 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 97,96,769 కు, మరణాల సంఖ్య 1,42,186 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 3,63,749 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 37,528 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 92,90,834 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 94.84 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఇక డిసెంబర్ 10 నాటికీ దేశంలో 15,16,32,223 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 8,72,497 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ