గత నవంబర్ లో జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మరో ఘనత సాధించారు. డిసెంబర్ 11, శుక్రవారం నాడు 2020 ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జో బైడెన్-కమలా హారిస్లను టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. “అమెరికన్ కథను మార్చడం కోసం, విభజన యొక్క శక్తుల కంటే సానుభూతి శక్తులు గొప్పవని చూపించడం కోసం, విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రపంచానికి వైద్యంపై దృష్టిని పంచుకోవడం కోసం జో బైడెన్-కమలా హారిస్ లను టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటిస్తున్నాం” అని టైమ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ ఎడ్వర్డ్ ఫెల్సెంథల్ ప్రకటించారు. మరోవైపు 1927 నుంచి ప్రతి సంవత్సరం అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులకు టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటిస్తూ వస్తుంది.
Joe Biden and Kamala Harris are TIME’s 2020 Person of the Year #TIMEPOY https://t.co/o97QNlSBrl pic.twitter.com/KuoBoebBN4
— TIME (@TIME) December 11, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ