దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వరుసగా మూడో రోజు 2 వేలకుపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,32,730 కేసులు, 2263 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,86,920 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి 10 రాష్ట్రాల్లోనే 75.01 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 24,28,616 (14.93%) కు చేరుకుంది. మరో 1,93,279 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,36,48,159 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 83.92 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.15 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (ఏప్రిల్ 22 8am–ఏప్రిల్ 23 8am) :
- మహారాష్ట్ర – 67013
- ఉత్తరప్రదేశ్ – 34254
- కేరళ – 26995
- ఢిల్లీ – 26169
- కర్ణాటక – 25795
- ఛత్తీస్ ఘడ్ – 16750
- రాజస్థాన్ – 14468
- గుజరాత్ – 13105
- తమిళనాడు – 12652
- మధ్యప్రదేశ్ – 12384
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 568
- ఢిల్లీ – 306
- ఛత్తీస్ ఘడ్ – 207
- ఉత్తర్ ప్రదేశ్ – 195
- గుజరాత్ – 137
- కర్ణాటక – 123
- జార్ఖండ్ – 106
- పంజాబ్ – 75
- మధ్యప్రదేశ్ – 75
- తమిళనాడు – 59
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ