దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మళ్ళీ క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో 4,65,918 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 3545 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారి పాసిటివిటీ రేటు 0.76 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,30,94,938 కు చేరుకుంది. అలాగే కొత్తగా 27 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,002 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 3,549 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,25,51,248 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 19 వేలకుపైగా (19,688 – 0.04%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధిక కరోనాకేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (మే 5 (8am)–మే 6 (8am)):
- ఢిల్లీ – 1365
- హర్యానా – 534
- ఉత్తర్ ప్రదేశ్ – 356
- కేరళ – 342
- మహారాష్ట్ర – 233
- కర్ణాటక – 191
- రాజస్థాన్ – 98
- పంజాబ్ – 87
- తమిళనాడు – 58
- తెలంగాణ – 44
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ