దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో మొత్తం 4,33,659 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 14,506 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 3.35 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,34,33,345 కు చేరుకుంది. అలాగే కొత్తగా 30 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,077 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, హర్యానా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 11,574 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,28,08,666 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.56 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 99,602 (0.23%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధిక కరోనాకేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జూన్ 28 (8am)–జూన్ 29 (8am)):
- మహారాష్ట్ర – 3482
- కేరళ – 2993
- తమిళనాడు – 1484
- కర్ణాటక – 968
- పశ్చిమబెంగాల్ – 954
- ఢిల్లీ – 874
- ఉత్తర్ ప్రదేశ్ – 519
- గుజరాత్ – 475
- తెలంగాణ – 459
- హర్యానా – 437
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY