దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా 4 లక్షలకు చేరుకుంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,79,257 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 3645 మంది మరణించడంతో మరణాల సంఖ్య 2,04,832 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 30,84,814 (16.79%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా మహారాష్ట్ర (63,309), కర్ణాటక (39,047), కేరళ (35,013), ఉత్తర్ ప్రదేశ్ (29,751), ఢిల్లీ (25,986), వెస్ట్ బెంగాల్ (17,207), తమిళనాడు (16,665), రాజస్థాన్ (16,613), ఛత్తీస్ గడ్ (15,563), ఆంధ్రప్రదేశ్ (14,669) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 3,79,257 కేసులలో 72.20% శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 82.10 శాతం, మరణాల రేటు 1.11 శాతం:
దేశంలో మరో 2,69,507 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,50,86,878 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 82.10 శాతం గానూ, మరణాల రేటు 1.11 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో లద్దాఖ్, మిజోరాం, త్రిపుర, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ