తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలను కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కాగా ఈ స్థానాల్లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటి మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మే 7వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పరీశీలకులను నియమించింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నికల పరిశీలకుల పేర్లను ప్రకటించారు.
ఎన్నికల పరిశీలకులు అంతా గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్సర్వర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పోరేషన్లకు మేయర్లును, డిప్యుటీ మేయర్లును, ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు క్రమశిక్షణతో ఎన్నుకోనున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ పరీశీలకుల వివరాలు:
- వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులు : మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్
- ఖమ్మం కార్పోరేషన్ పరిశీలకులు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి
- కొత్తూరు మున్సిపాలిటీ పరిశీలకులు : మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
- నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులు : టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు
- సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులు : రవీందర్ సింగ్ (మాజీమేయర్ కరీంనగర్), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్)
- అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- జడ్చర్ల మున్సిపాలిటీ పరిశీలకులు : మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ చైర్మన్)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ