భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 53 లక్షలు దాటింది. సెప్టెంబర్ 19, ఆదివారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,08,014 కు, మరణాల సంఖ్య 85,619 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 93,337 కరోనా పాజిటివ్ కేసులు, 1247 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.
మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 42 లక్షలు దాటింది. ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో 95,880 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 42,08,431 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 79.3 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 10,13,964 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu