దేశంలో ఉగ్రవాద దాడులకు కుట్రపన్నుతున్న ఆల్ఖైదా టెర్రరిస్టుల ప్రయత్నాలను ఈ రోజు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు భగ్నం చేశారు. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో శనివారం ఉదయం కేరళ, బెంగాల్లో దాడులు నిర్వహించి 9 మంది ఆల్ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. కేరళలోని ఎర్నాకుళం మరియు పశ్చిమబెంగాల్లోని ముషీదాబాద్లో దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ ప్రకటించింది. బెంగాల్ లో ఆరుగురు టెర్రరిస్టులను అరెస్టు చేయగా, కేరళలో ముగ్గురుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి డిజిటల్ పరికరాలు, డాకుమెంట్స్, పలు ఆయుధాలు, ఉగ్రవాద ప్రేరేపిత పుస్తకాలు స్వాధీనం చేసుకునట్టు తెలుస్తుంది. వీరి కార్యకలాపాల గురించి మరింత సమచారం రాబట్టేందుకు ఎన్ఐఏ అధికారులు కీలక విచారణ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu