భారత్లో కరోనా మహమ్మారి అనూహ్యంగా విస్తరిస్తోంది. దేశంలో ఒకే రోజులో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 302 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అయితే కరోనా విజృంభణ అసాధారణంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే అక్కడ 36 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇపటివరకు, 27 రాష్ట్రాల్లో 3,007 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1,199 మంది పేషెంట్లు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కేంద్ర వైద్యారోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో.. 3,71,363 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 30,836 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 302 మరణాలతో మొత్తం భారత్లో 4, 83, 178 మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఇప్పటివరకు 149 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని అందించినట్లు కేంద్రం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ